మునుగోడులో ముదిరాజులకు టికెట్ ఇవ్వకపోతే బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడిస్తాం
చండూరు, ముద్ర:మునుగోడు నియోజకవర్గంలో ముదిరాజ్లకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతేబిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని చిత్తుగా ఓడిస్తాం అని మునుగోడు ముదిరాజుల రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ హెచ్చరించారు. ఆదివారం మున్సిపల్ కేంద్రంలోని బిఆర్సి ఫంక్షన్ హాల్ లో జరిగిన మునుగోడు ముదిరాజుల ఆత్మగౌరవసభలో పాల్గొని మాట్లాడారు మునుగోడు నియోజకవర్గంలో 33 వేల పైగాకు ఓటర్లు ఉన్నారని తెలిపారు. అనేకసార్లు బి ఆర్ఎస్ అధిష్టానానికి మునుగోడు నియోజకవర్గంలో ముదిరాజులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరిన అధిష్టానం పట్టించుకోకుండా, ఓడిపోయే ఎమ్మెల్యే అభ్యర్థికి టికెట్ ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో బి ఆర్ స్ అభ్యర్థి ఓడిపోవడం ఖాయమని అన్నారు.119 వర్గాలలో ఒక్క ముదిరాజ్ బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని, రాబోయే రోజుల్లో ముదిరాజులంతా ఐక్యతగా ఉండి ఎన్నికల్లో ముదిరాజుల ఐక్యత సత్తా ఏంటో చూపించాలన్నారు.
బిత్తిరి సత్తి...
నల్గొండ జిల్లా పోరాటాలకు పురిటి గడ్డ అని కమెడియన్, నటుడు బిత్తిరి సత్తి అన్నారు. చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య పోరాటాల యోధుల స్ఫూర్తి తోటి ముందుకు సాగాలని నియోజకవర్గ ముదిరాజులకు పిలుపునిచ్చారు. ఆ స్ఫూర్తి తో మునుగోడు గడ్డపై నారా బోయిన రవి , ముదిరాజ్ ల అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపాలన్నారు. వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజుల సత్త ఏమిటో చూపించాలని ఆయన సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో మునుగోడు జడ్పిటిసి నారబోయిన స్వరూప రాణి రవి ముదిరాజ్, కావలి ఆంజనేయులు, బొమ్మరబోయిన ప్రేమలత సైదులు,రాజు, వెలుగు రవి, బొల్లం వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.