బిఆర్ఎస్ ఎస్సీ సెల్ గ్రామ కమిటీ ఎన్నిక

బిఆర్ఎస్ ఎస్సీ సెల్ గ్రామ కమిటీ ఎన్నిక

ముద్ర న్యూస్ రేగొండ.. రేగొండ : మండలంలోని పొనగల్లు లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ ఎస్సీ సెల్ గ్రామ కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వారణాసి అజయ్ తెలిపారు. ఆదివారం మండలంలోని పొనగల్లు గ్రామంలో ఎస్సీ సెల్ గ్రామ కమిటీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఏనమల్ల సంజీవ్, ఉపాధ్యక్షులు ఇంజపెల్లి దామోదర్, ప్రధాన కార్యదర్శి బొల్లం రవికుమార్, కార్యదర్శి ఎలబద్రి రమేష్, కార్యవర్గ సభ్యులు ఎలా బద్రి సురేష్ గుర్రం కుమారస్వామి నీల కంటి రాజులను ఏకగ్రీవంగా  ఎన్నుకున్నట్లు అజయ్ తెలిపారు. ఎస్సీ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన  సంజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్షులుగా నియమించినందుకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, బిఆర్ఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.