విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న బీఆర్​ఎస్​

విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న బీఆర్​ఎస్​
  • శివసేన పార్టీ  అధ్యక్షుడు సింకారు శివాజీ 

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 600 మండలాలకు గాను కేవలం 16 మంది మాత్రమే రెగ్యూలర్ ఎంఈఓలున్నారని శివసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు సింకారు శివాజీ తెలిపారు. 18 ఏళ్ళుగా బదిలీలు లేకుండా ఒకే చోట 16 మంది ఎంఈఓలు పని చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది డీఈఓలు ఉండాలని, అయితే కేవలం 10 మంది మాత్రమే రెగ్యూలర్ డీఈఓలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కనీసం విద్యా శాఖ మంత్రికైనా ఈ విషయం తెలుసా అని ఆయన ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేస్తుందని ఆయన ఆరోపించారు. విద్యా వ్యవస్థ బాగు కోసం త్వరలో గవర్నర్ ను కలిసి సమస్యలను వివరిస్తామని ఆయన తెలిపారు.