రైతులను తప్పు తోవ పట్టించేందుకే బీ ఆర్ ఎస్ కొత్త డ్రామాలు.

రైతులను తప్పు తోవ పట్టించేందుకే బీ ఆర్ ఎస్ కొత్త డ్రామాలు.

మెట్‌పల్లి ముద్ర: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక రైతులను తప్పు పట్టించేందుకు బీ ఆర్ ఎస్ పార్టీ కొత్త డ్రామాలు ఆడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. బుధవారం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు కాంగ్రెస్ నాయకులు వేరువేరుగా ఒక వర్గం సబ్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించగా, మరో వర్గం ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీవో కార్యాలయం లో వినతి పత్రం అందజేశారు.

తానా సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు వక్రీకరించారని. రైతులకు ఉచిత కరెంట్ అందించింది కేవలం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రైతులకు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మేలు చేసిందని కావాలని కుట్ర పూరితంగా బీ ఆర్ ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి మాటలపై రాద్దాంతం చేస్తూ రైతులను తప్పు తోవ పట్టిస్తున్నారని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్, కిషన్ సెల్ అద్యక్షుడు వాకిటి సత్యం రెడ్డి, జెట్టి లింగం, యామా రాజయ్య, అంజి రెడ్డి, ప్రవీణ్, ఎర్రోళ్ల హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.