రాష్ట్రంలో బీఆరెస్ గెలిచి హ్యాట్రిక్ సాధించాలి

రాష్ట్రంలో బీఆరెస్ గెలిచి హ్యాట్రిక్ సాధించాలి

ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే దివాకర్ రావు

ముద్ర, ప్రతినిధి, లక్షెట్టిపేట (మంచిర్యాల) : వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆరెస్ ను అఖండ మెజార్టీతో గెలిపించి హ్యాట్రిక్ సాధించేలా కార్యకర్తలు నడుం బిగించాలని ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం లక్షెట్టిపేట లో కార్యకర్తలు తో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మరోసారి రాష్ట్రంలో బీఆరెస్ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని సూచించారు.

లక్షెట్టిపేట మున్సిపాలిటీ లో పెద్ద ఎత్తున మెజార్టీని తీసుకురావాలని కోరారు. అనంతరం జిల్లా ఇంచార్జి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ,  బీఆరెస్ కార్యకర్తలు గ్రామీణ స్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు నడిపెళ్లి విజిత్ రావు, మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.