బిఆర్ఎస్ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనం
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని విఠలపూర్ లో మంగళవారం బిఆర్ ఎస్ విద్యార్థి విభాగ ఆత్మీయ సమ్మేళనం మండల విద్యార్థి విభాగ అధ్యక్షులు గుజ్జ రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గ్రామంలో విద్యార్థి విద్యార్థి విభాగ బలోపేతానికి కృషి చేయాలని, సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్నో కళాశాలలో తీసుకొచ్చి విద్యార్థులందరికీ కూడా చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంత్రి హరీష్ రావుకృషి చేస్తున్నారని తెలిపారు సిద్దిపేటను విద్య హబ్ మార్చిన మంత్రి హరీష్ రావు కోసం పని చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.
భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగ విఠలాపూర్ గ్రామ శాఖ నూతన అధ్యక్షునిగా అరవింద్ రెడ్డిని ఆయ గ్రామల విద్యార్థి నాయకులు ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్. నవీన్, ఎంపిటిసి సునీత - సాగర్, బాలాకర్ రెడ్డి దేవయ్య పార్టీ సీనియర్ నాయకులు హాజరు కావడం జరిగింది విద్యార్థి విభాగ మండల ఉపాధ్యక్షుడు గణగొని శ్రవణ్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పడిగలింగం, ఉపాధ్యక్షులు గొల్లపల్లి రాజశేఖర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి ముడికే సురేందర్, మండల ప్రధాన కార్యదర్శి సుగంధర్ రెడ్డి విద్యార్థి విభాగ మండల కార్యదర్శి మంతపూర్ రాజు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చెట్టుపల్లి భానుచందర్, మండల విద్యార్థి విభాగ సోషల్ మీడియా కన్వీనర్ జానకి చందు,విద్యార్థి విభాగ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.