తెలంగాణ జానపద వృత్తి కళాకారుల సంఘం సూర్యాపేట జిల్లా కన్వీనర్ గా బచ్చల కూర రాంబాబు ఎన్నిక
![తెలంగాణ జానపద వృత్తి కళాకారుల సంఘం సూర్యాపేట జిల్లా కన్వీనర్ గా బచ్చల కూర రాంబాబు ఎన్నిక](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64c64844e14d4.jpg)
ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-తెలంగాణ జానపద వృత్తి కళాకారుల సంఘం సూర్యాపేట జిల్లా నూతన కమిటీని ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఎన్నుకున్నట్లుతిరుమల తిరుపతి శ్రీఅన్నమయ్య పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విజయ శంకర్ స్వామిజి, తెలంగాణ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండూరు భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ జానపద వృత్తి కళాకారుల సంఘం సూర్యాపేట జిల్లా కన్వీనర్ గా మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన బచ్చల కూర రాంబాబును,జిల్లా కో కన్వీనర్ గాసూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఎన్.దశరథ లనుఎన్నుకున్నారు. వీరితో పాటు కమిటీ సభ్యులుగా మణికంఠ, డి.చిరంజీవి, లింగయ్య,సంధ్య,ప్రవీణ్ వి.వెంకన్న,నాగార్జున,చారి, రమేష్, బన్నీ,శంకర్ నాయక్, గోపి, నరసింహ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.