కరీంనగర్ లో "బలగం" హంగామా

కరీంనగర్ లో "బలగం" హంగామా

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : బలగం సినిమా యూనిట్ కరీంనగర్ లో సందడి చేసింది. స్థానిక మహాత్మ జ్యోతిరావు పూలే మైదానంలో శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్ సారధ్యంలో బలగం సినిమా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నటీనటులతో రూపొందిన బలగం చిత్ర యూనిట్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ చిత్రం బలగం అన్నారు చిత్రానికి కథనే హీరో అన్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఎమోషన్స్ ను మెస్మరైజ్ చేసిన చిత్రం, అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వేణు ను అభినందించారు. చిత్ర యూనిట్ ను అభినందిస్తామని మంత్రి  కమలాకర్ తెలపడంతో కరీంనగర్ కు రావడం జరిగిందన్నారు. 100 సంవత్సరాల సినీ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు చిత్ర యూనిట్ కు అభినందన సభ ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి అని స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ ప్రజలకు కనెక్ట్ అయి విజయవంతంగా ప్రదర్శించబడుతున్న బలగం చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలను తట్టి లేపుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో చిత్ర పరిశ్రమకు దోహదపడే విధంగా కరీంనగర్ రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు. అనంతరం చిత్ర యూనిట్ ను గంగుల కమలాకర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు ప్రియదర్శిని నవ్య డైరెక్టర్ వేణు సంగీత దర్శకుడు బీమ్స్ నటులు రచ్చ రవి, బాలు తో పాటు తదితరులు పాల్గొన్నారు