బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం

బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం

ముద్ర, ఉప్పల్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ హైదరాబాద్ నగర కార్యవర్గ సభ్యుడు వై.రాజ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ అరెస్ట్ ను బుధవారం ఆయన ఖండించారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందన్నారు. అక్రమ అరెస్టులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ప్రశాంత్ పంపిన ప్రశ్నపత్రం బండి సంజయ్ కి రాకముందే టీవీ ఛానల్ లో ప్రసారం కావడంపై ఎందుకు విచారణ జరపడంలేదని ప్రశ్నించారు. సంజయ్ ని అక్రమంగా అరెస్ట్ చేసి కల్వకుంట్ల కుటుంబం పైశాచిక ఆనందం పొందుతుందని విమర్శించారు.