మోడీని కలిసిన బండి కుటుంబం

మోడీని కలిసిన బండి కుటుంబం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :నూతనంగా  బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. కుటుంబ నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉన్నత చదువులు చదివి దేశానికి గొప్ప కీర్తిని తీసుకురావాలని పిల్లలను ఉద్దేశించి అన్నట్లు తెలిసింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా హైదరాబాద్ రానున్న బండి సంజయ్ ని బిజెపి శ్రేణులు ఎయిర్ పోర్టు నుండి ఘనంగా ఆహ్వానించనున్నారు.