బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ బదిలీ

బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ బదిలీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా కొనసాగుతున్న సతీష్ కుమార్ పై బదిలీ వేటు పడింది. గత కొద్ది సంవత్సరాలుగా బాసరలో వివిధ కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం, విద్యార్థులు సమస్యలు ఎదుర్కోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సతీష్ కుమార్ ను ఆయన మాతృ సంస్థ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన గురువారం సాయంత్రం విధుల్లో నుండి విడుదలయ్యారు.