నిర్మల్ జిల్లా లో బీఆర్ఎస్ కు భారీ షాక్

నిర్మల్ జిల్లా లో బీఆర్ఎస్ కు భారీ షాక్
  • కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విఠల్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో భారత రాష్ట్ర సమితి కి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు జి విఠల్ రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కల సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఇటీవలి ఓటమి అనంతరం పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ వీడుతారని భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను వ్యతిరేకిస్తున్న కారణంగా చేరిక వాయిదా పడింది. ఇదే తరుణంలో పార్టీకి అధ్యక్ష హోదాలో కొనసాగుతున్న విఠల్ రెడ్డి పార్టీ వీడటం పార్టీ శ్రేణులు జీర్ణించు కోలేక పోతున్నాయి. 2014 లో కాంగ్రెస్ పక్షాన గెలిచిన విఠల్ రెడ్డి అనంతరం బీ ఆర్ ఎస్ లో చేరారు