BJP నేత దారుణ హత్య.. ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి మరీ

BJP నేత దారుణ హత్య.. ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి మరీ

ముద్ర,హైదరాబాద్:- హైదరాబాద్‌ యూసుఫ్ గూడ ఎల్ఎన్ నగర్‌లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. పది మంది గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. అతడి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయటంతోపాటు గొంతు కోసి హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూ్ల్ జిల్లాకు చెందిన సింగోటం రాముకు భార్య, కూతురు ఉంది. రాము బీజేపీ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనటంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.భార్యా, కూతురు స్వగ్రామంలోనే ఉంటుండగా.. రాము మాత్రం యూసుఫ్ గూడ ఎల్ఎన్ నగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. అయితే గత రాత్రి 11 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు అతడు అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి కిరాతకంగా హత్య చేసారు. ప్రైవేటు పార్ట్స్ కట్ చేయటంతో పాటు గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. స్థానికంగా ఉండే ఓ మహిళతో రాముకు గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని చెబుతున్నారు. కాగా, హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. హత్యకి అక్రమ సంబంధం కారణమా...? లేక ఇంకా వేరే పొలిటికల్ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడు బీజేపీ నుంచి నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది.