విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి

విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి

ముద్ర,పానుగల్:- పానుగల్ మండల పరిధిలోని రేమొద్దుల గ్రామానికి చెందిన ఆవుల సురేష్ కు చెందిన ఎద్దు విద్యుత్ షాక్ తో మృతి చెందింది.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ సమీపంలో ఉన్న తన వ్యవసాయ పొలంలో ఉన్న పశువుల పాకలో రోజువారీగా ఎద్దులు ఉండేవని,మేపు కోసం వెళ్ళిన ఎద్దు పొలం పక్కల ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వైర్ కు తగలడంతో విద్యుత్ షాక్ కు గురైందని తెలిపారు. ఎద్దు విలువ సుమారుగా 80 వేలు ఉంటుందని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధితుడు కోరారు.