బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో- కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో- కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: టీ ఎస్ పి ఎస్ సి పేపర్ల లీకేజీ పై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ అసమర్థతను నిరసిస్తూ నిర్మల్ లో గురువారం బీజే వై ఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. పేపర్ల లీకేజీ వ్యతిరేకంగా హైదరాబాద్ లోధర్నా నిర్వహిస్తున్న తమ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని నిరసించారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి, వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను జాతీయ రహదారిపై దహనం చేశారు.