బస్సు-బైక్ ఢీ- మహిళ మృతి

బస్సు-బైక్ ఢీ- మహిళ మృతి

 బాన్సువాడ, ముద్ర: బాన్సువాడ-కామారెడ్డి ప్రధాన రోడ్డు పై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందింది.  గాంధారి మండలం పోతంగల్ దగ్గర బాన్సువాడ నుండి కామారెడ్డి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. గాంధారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.