సేవా దృక్పథంతో వ్యాపారం నిర్వహించాలి

సేవా దృక్పథంతో వ్యాపారం నిర్వహించాలి
  • ఎమ్మెల్యే మందుల సామెల్.
    మోత్కూర్,ముద్ర న్యూస్:వ్యాపారులు సేవా దృక్పథంతో వినియోగాదారులకు సేవలు అందించాలని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.బుధవారం శ్రీ లక్ష్మి హీరో మోటర్స్ పదిహేనవ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే సామెల్ ముఖ్యతిధిగా పాల్గొని నూతన ద్విచక్ర వాహనాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మెట్టు మంగేష్,గణేష్ లు గత పదిహేను సంవత్సరాల క్రితం శ్రీ లక్ష్మి హీరో షోరూం స్థాపించి అంచెలు అంచెలుగా ఎదిగి వినియోగదారులకు సేవా దృక్పథంతో సేవలు అందిస్తున్నారని విన్యోగదారులు వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన హెల్త్ క్యాంప్ అభినందనీయం అని అన్నారు.ఈ కార్యక్రమం లో ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి లక్ష్మి నర్సింహా రెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ బొల్లెపెల్లి వెంకటయ్య,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండగోని రామాచంద్రు గౌడ్,జిల్లా నాయకులు అవిశెట్టి అవిలుమల్లు,శ్రీ లక్ష్మి హీరో షోరూం సిబ్బంది   తదితరులు పాల్గొన్నారు