రేపు ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం

రేపు ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్‌ ఫోన్‌ చేశారు.. ఎపి లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతోన్న తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని కోరారు పయ్యావుల.దీనికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంగీకారం తెలిపినట్టు చెబుతున్నారు.. దీంతో, రేపు బుచ్చయ్య చౌదరితో ముందుగా ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం స్వీకారం చేయించనున్నారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. అయితే, తెలుగు దేశం పార్టీలో సీనియర్‌ లీడర్‌ అయిన బుచ్చయ్య చౌదరి.. ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ఏడుసార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి బుచ్చయ్య చౌదరి..

ఇక, ఈ నెల 21, 22 తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తుంది.. ఈ సమావేశాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, వైసీపీ అధినేత వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి సహా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు బుచ్చయ్య చౌదరి. ఆ తర్వాత స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.. స్పీకర్‌గా మరో సీనియర్‌ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పేరు వినిపిస్తోన్న విషయం విదితమే. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ స్థానం నుంచి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించిన విషయం విదితమే...