సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
తిరుపతి: సూళ్లూరుపేట శ్రీహరి కోట షార్ కేంద్రంలో లో విధులు నిర్వహిస్తున్న చింతామణి (29 ) సిఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) కానిస్టేబుల్ రాడార్ సెంటర్ వద్ద చెట్టుకు ఉరి వేసుసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చింతామణి సొంత ఊరు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం. కుటుంబ కలహాలు లేదా అధికారులు వత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణం లో స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.