పేదల సంక్షేమమే సీఎం కెసిఆర్ లక్ష్యం: ఎమ్మెల్యే

పేదల సంక్షేమమే సీఎం కెసిఆర్ లక్ష్యం: ఎమ్మెల్యే
  • బతుకమ్మ చీరలు, కల్యాణ లక్ష్మి, గృహలక్ష్మి పత్రాల అందజేత

ముద్ర ప్రతినిధి, నల్లగొండ: పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కెసిఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం నకిరేకల్ నియోజకవర్గంలో కేతపల్లిలోని జ్యోతి ఫంక్షన్ హాల్ లో 354 మందికి గృహలక్ష్మి పధకం లబ్ధిదారులు, 18 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను, ఆడపడుచులకు బతుకమ్మ చీరలు, విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ ను ఆయన అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మాటలు నమ్మవద్దన్నారు కర్ణాటకలో మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని తెలిపారు. సీఎం కెసిఆర్ ఇప్పటివరకు ఇచ్చిన హామీలతో పాటు అదనంగా పలు రకాల సంక్షేమ పదకాలు ప్రవేశపెట్టి అందిస్తున్నారని అన్నారు గృహాలక్షి పధకం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.