రోడ్డు ప్రమాదంలో గిరిజనుల మృతి సీఎం కేసీఆర్​ తీవ్ర దిగ్ర్భాంతి 

రోడ్డు ప్రమాదంలో గిరిజనుల మృతి సీఎం కేసీఆర్​ తీవ్ర దిగ్ర్భాంతి 

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దాచపల్లి వద్ద జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో ... తెలంగాణ దామరచర్ల మండలం నర్సపూర్ గ్రామానికి చెందిన ఆరుగురు గిరిజన కూలీలు మరణించడం, పలువురు తీవ్ర గాయలవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు తీవ్ర దిగ్బ్రాం తి వ్యక్తం చేశారు.  ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సిఎం సంతాపం ప్రకటించారు.  మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు.  గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్సను అందించాలని స్థానిక మిర్యాలగూడ ఎమ్మెల్యేను నలమోతు భాస్కర్ రావును సిఎం కేసిఆర్ ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావులు ప్రమాద సంఘటనను వివరించి తగు సహాయం చేయాలని కోరిన మేరకు చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 5 లక్షల రుపాయలు, గాయపడిన వారికి ఒక లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియాను సిఎం కేసిఆర్ ప్రకటించారు.