దేవాలయాల అభివృద్ధికి కృషి చేసిన సీఎం కేసీఆర్ 

దేవాలయాల అభివృద్ధికి కృషి చేసిన సీఎం కేసీఆర్ 
  • ఎలికట్ట అంబ భవానిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజయ్య 

ముద్ర, షాద్‌నగర్:- ఎలికట్ట భవాని మాత దేవాలయాన్ని ఆదివారం స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సందర్శించారు అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. కొలువుదీరిన దుర్గామాతను షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ పూజించారు. అమ్మవారికి భారీ గజమాల ధరింపజేశారు అదే విధంగా లక్ష పుష్పార్చన కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా పూజించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి పాటుపడింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల అన్నింటికీ లక్షల రూపాయల నిధులు ఇటీవల విడుదల చేశారని ఆలయాల్లో ఉన్న సమస్యలను రూపుమాపి భక్తులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కలిపించిందని ఆయన పేర్కొన్నారు.