విశాఖ స్టీల్ ప్లాంట్పై తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించిన సీపీఐ
విశాఖ స్టీల్ ప్లాంట్పై తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని సీపీఐ స్వాగతించింది. బిడ్డంగ్లో తెలంగాణ పాల్గొనడంపై సీపీఐ నారాయణ స్పందించారు. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తులుగా తీసుకుంటే వ్యతిరేకిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వం తీసుకుంటే పబ్లిక్ సెక్టార్గా మారుతుందన్నారు. స్టీల్ ప్లాంటు కొనుగోలు చేస్తే నష్టం ఉండదని, దొంగల చేతికి ప్లాంట్ వెళితే రూ. 3 లక్షల కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. అదానీ ఎందుకు వస్తున్నారు? అని ప్రశ్నించారు.