సీడబ్ల్యూసీలో ఆరుగురికి చోటు
- 39 మందితో కొత్త కమిటీని ప్రకటించిన ఏఐసీసీ చీఫ్ఖర్గే
- శాశ్వత ఆహ్వానితులుగా 32 మంది
- ప్రత్యేక ఆహ్వానితులుగా 9 మంది
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు తీసుకునే అత్యున్నత స్థాయి వ్యవస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని పునర్ వ్యవస్థీకరించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ఆదివారం సీడబ్ల్యూసీలో స్థానం దక్కించుకున్న పేర్లను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
- రేవంత్, ఉత్తమ్కు నిరాశ..
త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలవారికి కూడా సీడబ్ల్యూసీలో చోటు దక్కింది. వారిలో 39 మందిని సీడబ్ల్యూసీ సభ్యులుగా నియమించారు. కమిటీలో శాశ్వత ఆహ్వానితులుగా 32 మంది నేతలు, ప్రత్యేక ఆహ్వానితులుగా 9 మంది నేతలు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురికి స్థానం కల్పించారు. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి సీడబ్ల్యూసీ టీంలో సభ్యుడిగా ప్రాతినిధ్యం దక్కింది. సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులుగా ఏపీ తెలంగాణ నుంచి సుబ్బరామిరెడ్డి, కొప్పుల రాజు, దామోదర రాజనర్సింహకు స్థానం దక్కింది. ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లంరాజు, వంశీచంద్ రెడ్డికి చోటు దక్కింది. తెలంగాణలో రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఆయన వెంటే ఉన్న వంశీచంద్ రెడ్డికి సీడబ్ల్యూసీలో స్థానం దక్కగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గాలకు నిరాశ మిగిలింది.
- సీడబ్ల్యూసీ సభ్యులు..
సీడబ్ల్యూసీ సభ్యులుగా -సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, మీరా కుమార్, దిగ్విజయ్ సింగ్, పి.చిదంబరం, తారిఖ్ అన్వర్, లాల్ తన్హావాలా, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, అశోక్రావ్ చవాన్, అజయ్ మాకెన్, చరణ్జిత్ సింగ్ చన్నీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కుమారి సెల్జా, గైఖంగమ్, ఎన్.రఘువీరారెడ్డి, శశిథరూర్, తమ్రాధ్వాజ్ సాహు, అభిషేక్ మను సింఘ్వీ, సల్మాన్ ఖుర్షీద్, జైరామ్ రమేశ్, జితేంద్ర సింగ్, రాజ్దీప్ సింగ్ సూర్జేవాలా, సచిన్ పైలట్, దీపక్ బబారియా, జగదీశ్ ఠాకూర్, జీఏ మీర్, అవినాశ్ పాండే, దీపా దాస్ మున్షీ, మహేంద్రజీత్ సింగ్ మాల్వియా, గౌరవ్ గగోయ్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, కమలేశ్వర్ పటేల్, కేసీ వేణుగోపాల్ ఉన్నారు.
- శాశ్వత ఆహ్వానితులు..
శాశ్వత ఆహ్వానితులుగా--- వీరప్ప మొయిలీ, హరీశ్ రావత్, పవన్ కుమార్ బన్సల్, మోహన్ ప్రకాశ్, రమేశ్ చెన్నితల, బీకే. హరిప్రసాద్, ప్రతిభా సింగ్, మనీశ్ తివారి, తారిఖ్ హమీద్ కర్రా, దీపేందర్ సింగ్ హుడా, గిరీశ్ రాయ చోడంకర్, టి. సుబ్బరామిరెడ్డి , కొప్పుల రాజు, చంద్రకాంత్ హాండోర్, మీనాక్షి నటరాజన్, ఫూలో దేవి నేతమ్, దామోదర రాజనర్సింహ, సుదీప్ రాయ్ బర్మన్ ఉన్నారు.
- ఇన్చార్జులు.. ప్రత్యేక ఆహ్వానితులు..
ఇన్చార్జులుగా డాక్టర్ ఎ. చెల్లకుమార్, భక్త చరణ్ దాస్, హరీశ్ చౌదరి, అజయ్ కుమార్, రాజీవ్ శుక్లా, మాణిక్యం ఠాకూర్, సుఖ్వింద్ రాంధావా, మాణిక్రావ్ ఠాక్రే, రజనీ పటేల్, కన్హయ్య కుమార్, గురుదీప్ సప్పాల్, సచిన్ రావు, దేవేందర్ యాదవ్, మనీశ్ ఛత్రా ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా--- పల్లం రాజు, పవన్ ఖేరా, గణేశ్కొడియాల్, కొడిక్కునిల్ సురేశ్, యశోమతి ఠాకూర్, సుప్రియా శ్రీనాథే, ప్రినితి షిండే, ఆల్కా లాంబా, వంశీచంద్ రెడ్డి ఉన్నారు. అలాగే ఎక్స్అఫీషియో సభ్యులుగా ---బీవీ శ్రీనివాస్- ఐవైసీ అధ్యక్షుడు, నీరజ్ కుందన్- ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు, నేట్టా డిసౌజా- అధ్యక్షురాలు మహిళా కాంగ్రెస్, లాజీ దేశాయ్ చీఫ్ ఆర్గనైజర్ సేవాదళ్ ఉన్నారు.