బీఆర్ఎస్ లీడర్ల సంబరాలు

బీఆర్ఎస్ లీడర్ల సంబరాలు

రామకృష్ణాపూర్,ముద్ర : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఓకే సారి 115 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించడంతో బీఆర్ఎస్ లీడర్ల సంబరాలు అంబరాన్నంటాయి. చెన్నూరు నియోజకవర్గంలో 2018 ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందిన బాల్క సుమన్ కు తిరిగి టికెట్ కేటాయించడంతో చెన్నూరు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సూపర్ బజార్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు బాణా సంచాలు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి పలు చౌరస్తాలలో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యా సాగర్, పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్,వార్డు కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.