చంద్ర బాబు అక్రమ అరెస్టు ఆప్రజాస్వామికం

చంద్ర బాబు అక్రమ అరెస్టు ఆప్రజాస్వామికం

తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దోమల వెంకటయ్య

మునుగోడు, ముద్ర: నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలోతెలుగుదేశం పార్టీ శ్రేణులుటిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టుకి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మనుదగ్ధం చేశారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దోమల వెంకటయ్య మాట్లాడుతూ,చంద్రబాబు మీదఅమానుషంగాజగన్ ప్రభుత్వంప్రవర్తిస్తున్న తీరునుతెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, టిడిపి శ్రేణులుగమనిస్తున్నారనివారన్నారు. జగన్ జీవితం 16 నెలల జైలు జీవితం గడిపారని, అతనిపై 36 కేసులు ఉన్నాయని ఆయన గురించి ఉమ్మడి తెలుగు ప్రజలకు తెలుసనివారు అన్నారు. చంద్రబాబు అరెస్టుపై తెలుగుప్రజలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు తగిన బుద్ధి చెప్తారని వారు అన్నారు.

ఎలాంటి మచ్చలేని నాయకుడు,ప్రపంచం గుర్తించిన నాయకుడు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని వారు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 70 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చారని సాక్షాత్తు కోర్టు తెలియజేసిందని వారు అన్నారు. 40 సంవత్సరాలుగా తెలుగు ప్రజలకు సేవ చేసిన వ్యక్తి చంద్రబాబుఅని, తెలుగుదేశం పార్టీకి ప్రజల నుండి వస్తున్న ఆదరణ ఓర్వలేక చంద్రబాబును అరెస్టు చేయించడం చాలా బాధాకరమనివారు అన్నారు.ఈ కార్యక్రమంలోమండల పార్టీ ఉపాధ్యక్షులుపుప్పాల యాదయ్య,రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిపగడాల లింగయ్య,తెలుగు రైతు సంఘం మండల కార్యదర్శిపంగా కృష్ణయ్య, ఎరుగండ్లపల్లి గ్రామ శాఖ కార్యదర్శికొండలాచారి,మండల పార్టీ నాయకులుఎండి షర్ఫుద్దీన్,శ్రీనుతదితరులు పాల్గొన్నారు.