నేడు ఢిల్లీ కి చంద్రబాబు , పవన్ కళ్యాణ్...

నేడు ఢిల్లీ కి చంద్రబాబు , పవన్ కళ్యాణ్...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-టిడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఈరోజు (జూన్ 5వ తేదీ) దిల్లీకి వెళ్లనున్నారు. ఎన్డీయే సమావేశంలో ఈ నేతలు పాల్గొననున్నారు.మద్దతుపై లాంఛనంగా తీర్మానం చేయనున్నారు. ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీనికి బీజేపీ పెద్దలను ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు సమాచారం.మరోవైపు ఫలితాలు వెల్లడైన తర్వాత మంగళవారం రోజున చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు గంటకుపైగా చర్చలు సాగాయి. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారంపై చర్చించినట్లు సమాచారం.

ఎన్డీయే సమావేశానికి హాజరయ్యే అంశంపైనా నేతలు మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఈ క్ర మంలో పిఠాపురం ప్రజలందరికీ పవన్‌ కల్యాణ్‌ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. కదం తొక్కిన జనసైనికులకు పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. ప్రజలు ఆకాశమంత విజయం ఇచ్చారని.. దాన్ని గుండెల్లో పెట్టుకుంటామని అన్నారు. గెలుపు తనకు బాధ్యతనిచ్చిందని.. అహంకారాన్ని కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.