మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి మృతికి చంద్రబాబు సంతాపం

మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి మృతికి చంద్రబాబు సంతాపం

అమరావతి :- మాజీమంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ ఎర్నేని సీతాదేవి మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. రెండు పర్యాయాలు శాసనసభ్యురాలిగా ఎన్నికైన సీతాదేవి, విద్యాశాఖా మంత్రిగా తనదైన ముద్ర వేశారని అన్నారు. సీతాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని చంద్రబాబు ప్రకటించారు. ఈ రోజు హైదరాబాద్ లో సీతాదేవి గుండెపోటుతో మృతి చెందారు.