అద్భుత క్షణాలు మరువలేం

అద్భుత క్షణాలు మరువలేం
  • నందిగాం ఎంపీపీ  ప్రియాంక శివ శంకర్ గౌడ్ దంపతులు
  • రామ నామ స్మరణతో మారుమోగుతున్న "చేగూరు రామాలయం" 

షాద్ నగర్,ముద్ర : 500 ఏళ్ల కల నేటితో సాకారం అవుతుందని కోటానుకోట్ల భక్తుల అభిజ్ఞ నెరవేరుతోందని  నందిగామ ఎంపీపీ ప్రియాంక, శివ శంకర్ గౌడ్ దంపతులు తెలిపారు. అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుండడంతో నందిగామ మండలం చేగురు రామాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ అద్భుత, అరుదైన దృశ్యాలను చూసేందుకు, శ్రీరాముడి ఆశీస్సులు పొందేందుకు గ్రామ నలుమూలల నుంచి భక్త జనులు చేగురు రామాలయానికి తరలి వచ్చారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠాపన క్రతువులను నిర్వహిస్తున్నారని అయితే, అయోధ్యకు వెళ్లలేక, ఈ అద్భుత క్షణాలను నేరుగా ఆస్వాధించలేకపోతున్నామని చాలా మంది రామ భక్తులు ఆయా రామాలయాల్లో పెద్ద ఎత్తున భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కనివిని ఎరుగని రీతిలో భక్తులు రామాలయానికి తరలివచ్చారని శివశంకర్ గౌడ్ పేర్కొన్నారు. ఆ శ్రీరామచంద్రమూర్తి దర్శనం ఎంతో మహా భాగ్యమని శివశంకర్గౌడ్ అన్నారు.