సోమప్ప ఆలయ కమిటీ చైర్మెన్ గా చిత్తనూరి సత్యనారాయణ

సోమప్ప ఆలయ కమిటీ చైర్మెన్ గా చిత్తనూరి సత్యనారాయణ
  • సోమప్ప ఆలయ నూతన కమిటీ నియామకం 

ముద్ర న్యూస్ నేరేడుచర్ల: సోమారం గ్రామపంచాయతీ పరిధిలోని చారిత్రాత్మక సోమప్ప దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా నేరేడుచర్ల పట్టణానికి చెందిన  చిత్తనూరు సత్యనారాయణ నియమితులైనారు.రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం  దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదేవిధంగా ఆలయ కమిటీ  వైస్ చైర్మన్ గా లొడంగి లక్ష్మయ్య, కమిటీ సభ్యులుగా మాలోత్ బాలమణి ,పగిడిమర్రి సోములు , పెండెం సైదులు,ఆలయ పూజారి ఇరువంటి  శ్రీనివాస శాస్త్రిలను నియమించారు.

ఈ సందర్భంగా చిత్తనూరు సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ కమిటీ చైర్మన్ గా సోమప్ప ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని భక్తులకు కావలసిన మెరుగైన సౌకర్యాల కల్పనకు పాటుపడతానన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసన సభ్యురాలు నలమాద పద్మావతి లతో పాటు నేరేడుచర్ల మండల , కాంగ్రెస్ అధ్యక్షులు  కొణతం చిన వెంకటరెడ్డి కాంగ్రెస్ జిల్లా నాయకులు చలసాని శ్రీనివాసరావు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, నూకల సందీప్ రెడ్డి , మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా రామారావు, జడ్పిటిసి  నరసయ్య, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్, వైస్ చైర్మన్ అలక సరిత సైదిరెడ్డి లతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.