అస్వస్థతకు గురైన విద్యార్థినులకు పరామర్శ

అస్వస్థతకు గురైన విద్యార్థినులకు పరామర్శ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బుధవారం రాత్రి నర్సాపూర్ కె జి బీ వి లో అస్వస్థతకు గురై, నిర్మల్ ప్రధానాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఎంఎల్ఏ మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ లు వేర్వేరుగా పరామర్శించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ మండల కేంద్రంలోని కె జి వి బి పాఠశాలలో  అస్వస్థతకు గురైన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. తక్షణమే దీనికి కారకులైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ విద్యార్థినుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని, తల్లిదండ్రులు భయం వీడాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో డి ఇ ఒ రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.