గార్ల ప్రభుత్వ హాస్పిటల్ ను తనిఖీ చేసిన కలెక్టర్.    

గార్ల ప్రభుత్వ హాస్పిటల్ ను తనిఖీ చేసిన కలెక్టర్.    

ముద్ర న్యూస్-గార్ల:మహబూబాబాద్ జిల్లా లోని గార్ల మండల కేంద్రంలోని హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ శశాంక గురువారం సందర్శించారు.హాస్పిటల్ లో వసతులను పరిశీలిస్తూ...పోస్ట్ మార్టం గదిని, డైట్ షెడ్ , 108 వాహనం వచ్చేందుకు సి.సి.రోడ్ పనులు చేపట్టాలన్నారు.హాస్పిటల్ పనితీరు మెరుగు పరచేందుకు యంత్రాంగం సమిష్టిగా కృషిచేయాలన్నారు.ఓ.పి. పెంచాలని. గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలని.బయో మెడికల్ వృధా ను గ్రామ పంచాయతీ చెత్తలో కలపరాదని.డాక్టర్ లు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.హాస్పిటల్ ముందు భాగంలో వాహన రాకపోకలకు మార్పులు చేపట్టాలన్నారు,రోగులను పలకరించి. వైద్యం అందే తీరును ఆడిగితెలుసుకుని.  హాస్పిటల్ సిబ్బంది భోజన సదుపాయాలు కల్పిస్తున్నారా...లేదా ఆడిగి తెలుసుకున్నారు.ఆంతకుముందు సీతంపేట నర్సరీ ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి మొక్కలను వినియోగించని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగేనిర్వహణ చేస్తున్న  వ్యక్తికి వేతన చేయకపోవడం పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. కలెక్టర్ వెంట డి.ఆర్.డి.ఓ.సన్యాసయ్య, జిల్లా జనరల్ హాస్పిటల్ పర్యవేక్షకులు వెంకట రాములు,గార్ల డాక్టర్ రమేష్, టి.ఎస్.ఎం.ఐ.డి.సి. డీఈ శ్రీనివాస్ తహసీల్దార్ స్వాతి బిందు ఎంపీడీఓ రవీందర్ గార్ల సర్పంచ్ బన్సీ లాల్ తదితరులు పాల్గొన్నారు.