రాణిరుద్రమదేవిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

రాణిరుద్రమదేవిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

ముద్ర, మల్యాల :బీజేపీ నాయకురాలు రాణిరుద్రమదేవి మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన తప్పుడు ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని మల్యాల మండల యూత్ కాంగ్రెస్ పక్షాన రాణిరుద్రమదేవిపై శుక్రవారం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నేరెళ్ల సతీష్ రెడ్డి మల్యాల పట్టణ అధ్యక్షులు కటకం వినయ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు శనిగారపు తిరుపతి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నక్క అనిల్, ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షులు కొరపు వెంకటేష్, తాళ్ల హరినాథ్, వెలుమ కృష్ణ రెడ్డి తదితరులు ఉన్నారు.