మట్టి తరలింపుపై కలెక్టర్‌‌కు ఫిర్యాదు

మట్టి తరలింపుపై కలెక్టర్‌‌కు ఫిర్యాదు

జనగామ రూరల్‌, ముద్ర: జనగామ మండలం చీటకోడూరులోని రామప్ప కుంట నుంచి మట్టి  తరలిస్తున్న వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ రైతులు శుక్రవారం కలెక్టర్‌‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చీటకోడూరు రామప్ప దేవాలయం సమీపంలో నిర్మించిన ఫేజ్ 2 చెక్ డ్యాం నాణ్యత లేకుండా కట్టడంతో సైడ్ బర్మ్ తెగిపోయిందని తెలిపారు.

కాంట్రాక్టర్ తెగిపోయిన కట్టను మళ్లీ రిపేర్‌‌ చేసేందుకు కుంట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నాడని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్న ఈ పనులపై తగు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు సాదం మదన్ మోహన్, బాల్నె ఉమాపతి, రావుల రఘు, బాల్నె ప్రవీణ్ పాల్గొన్నారు.