సకాలంలో అమ్మకాలు పూర్తి చేయండి

సకాలంలో అమ్మకాలు పూర్తి చేయండి

 ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యాన్ని సకాలంలో అమ్మకాలు జరపాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రైతులకు సూచించారు. ఖానాపూర్ నియోజవర్గం లోని బాదన్ కుర్తి, సుర్జాపూర్ ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మంగళ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం గిట్టుబాటు ధరలతో కొనుగోలు చేస్తున్న తరుణంలో అనవసరంగా ఆలస్యం చేసి నష్టపోవడం తగదన్నారు.