పేద ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి కామ్రేడ్ మాధగోని నరసన్న

పేద ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి కామ్రేడ్ మాధగోని నరసన్న

నరసింహ 24 వ వర్ధంతి లో పాల్గొని ఘనంగా నివాళులు అర్పిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం

మునుగోడు, ముద్ర: బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ తా ను బతికినంత కాలం పేద ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి కామ్రేడ్ మాధగోని నరసింహ అని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం చండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలో నిర్వహించిన మాధగోని నరసింహ 24వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలో ఎర్ర జెండాలతో ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్యం మాట్లాడుతూ భూస్వాములకు, పెతందారులకు ఎదురు తిరిగి పేదల పక్షాన పోరాడిన వ్యక్తి మాధగోని నరసన్న అని అన్నారు. మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ బలోపేతం చేసిన వారిలో నరసన్న ఒకరు అని అన్నారు. నేటి యువతరం నర్సన్న ను ఆదర్శంగాగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నరసన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో *సిపిఐ మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్, జిల్లా సమితి సభ్యులు నలపరాజు రామలింగయ్య, మాజీ జెడ్పిటిసి మాధాగోని, విజయలక్ష్మి, మండల పార్టీ కార్యవర్గ సభ్యులు పల్లె యాదయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, తిప్పర్తిరాములు , ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బరిగల వెంకటేష్, దోటి వెంకన్న,బండమీది వెంకన్న, జెల్లా శ్రీను,గంటా రమేష్, సి హెచ్ ఊషయ్య, శాఖ కార్యదర్శి పల్లె నరసింహ, పరమేశ, ముత్తయ్య, హమీద్, శ్రీశైలం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.