చెన్నూరులో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం

చెన్నూరులో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం

డాక్టర్ రాజా రమేష్, నూకల రమేష్
రామకృష్ణాపూర్, ముద్ర : అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్, పిసిసి మెంబర్ నూకల రమేష్ అన్నారు. బుధవారం హైదరాబాద్ గాంధీ భవన్లో చెన్నూరు నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు రాజా రమేష్, నూకల రమేష్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిపతి రాజయ్య,మండల అధ్యక్షుడు కడారి జీవన్,వెంకన్న,బానేష్,కిరణ్, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జ్ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ ముజాహిద్,పల్లె రాజు తరిత్రులు పాల్గొన్నారు.