గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ మౌన దీక్ష

గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ మౌన దీక్ష

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల లోని గాంధీ పార్కులో మహాత్మగాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ శ్రేణులు మౌన దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ ఆదేశాలు మేరకు బుధవారం మౌన దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం కక్ష పూర్వకంగా వ్యవహరించడాన్ని ఆక్షేపిస్తూ మౌన దీక్షకు దిగినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విధానాలు, తప్పిదాలను నిలతీసినందుకు రాహుల్ పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హత ప్రకటించారని అన్నారు. ఇక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పై బీఆరెస్ తప్పుడు ప్రచారం చేయడం అవివేకం చర్యగా అభివర్ణించారు. విద్యుత్ పంపిణీ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈకార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు నరేష్, మున్సిపల్ కౌన్సిలర్ సల్ల మహేష్, నేతలు ఒడ్డె రాజమౌళి, బుద్ధర్తి శంకర్ ఇతర నేతలు పాల్గొన్నారు.