కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:- సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న  ఆరూరి సైదులు (41) ఉరివేసుకొని బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల  ఆర్థిక సమస్యల వలన కుటుంబంలో గొడవలు జరగడంతో మనస్థాపము చెందిన సైదులు ఈ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సమాచారం.

ఇటీవల భార్యాభర్తలిద్దరూ గొడవ పడడంతో  సైదులు భార్య కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వెళ్ళింది. భార్య పుట్టింటికి వెళ్లడంతో తట్టుకోలేకపోయిన సైదులు తన ప్రాణాలను తీసుకున్నట్టు తెలిసింది. 2004 బ్యాచ్ కి చెందిన సైదులు జిల్లా కేంద్రంలో కిరాయి ఇంట్లో ఉంటూ సూర్యాపేట ప్రస్తుత అదనపు ఎస్పీ మేక నాగేశ్వరరావు వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మృతుడు సైదులుకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.