వడదెబ్బకు కానిస్టేబుల్ బలి

వడదెబ్బకు కానిస్టేబుల్ బలి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల :మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని అంకతి వాడకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ముత్తె సంతోష్ (42) వడ దెబ్బతాకి ఆదివారం రాత్రి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం లక్షెట్టిపేటకు చెందిన సంతోష్ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం విధులు ముగించుకుని లక్షెట్టిపేటలోని స్వగృహంకు చేరుకున్నాడు. రాత్రి 11 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు. ఈమేరకు పోలీస్ లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.