ప్రధాని మోదీ ఫ్లెక్సీ తొలగింపు పై వివాదం

ప్రధాని మోదీ ఫ్లెక్సీ తొలగింపు పై వివాదం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ లో బిజెపి ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ ఫ్లెక్సీ తొలగింపు వివాదంగా మారింది. స్థానిక బస్ డిపో సమీపంలో అధికారుల అనుమతితోనే తాము ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని, మునిసిపల్ అధికారులు దాన్ని తొలగించటం ఏమిటని కమిషనర్ రాజు ను బిజెపి నేతలు నిలదీశారు. బి ఆర్ ఎస్, కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగించకుండా కేవలం తమ పార్టీ ఫ్లెక్సీ తొలగింపు కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని వారు ఆరోపించారు.