ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం...

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం...

ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో ఇవాళ కూడా ఎలక్షన్ కౌంటింగ్ కొనసాగనుంది. ఈ రాష్ట్రంలో ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. వరంగల్- ఉమ్మడి ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కూడా ఇంతకు ముందే జరిగాయి. వాటిని ఈరోజు లెక్కపెట్టనుననారు మే 27 జరిగిన ఈ ఉప ఎన్నిక పోలింగ్‌లో 72.44శాతం ఓటింగ్ నమోదయింది. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరిగింది.

మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌  నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది.నల్లగొండ దగ్గరలోని దుప్పల్లిలో ఉదయం 8 గంటలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇది రేపటి వరకు కొనసాగే అవకాశం అంటున్నారు. 3,36,013 బ్యలెట్ల లెక్కింపును మొత్తం 96 టేబుళ్ళ మీద చేపట్టనున్నారు.