దంపతుల ఆత్మహత్యా యత్నం

దంపతుల ఆత్మహత్యా యత్నం
  • భార్య మృతి, భర్తను ఆసుపత్రికి తరలింపు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:  నిర్మల్ పట్టణం ప్రియదర్శిని నగర్ కు చెందిన ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి (57), పుష్పలత దంపతులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్తను ఆసుపత్రికి తరలించారు. కృష్ణమూర్తి దంపతులు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు స్థానిక బంగల్ పేట్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అటుగా వెళుతున్నవారు వీరిని రక్షించే యత్నం చేశారు. ఐతే వీరిని బయటకు తీసే లోపునే భార్య పుష్పలత మృతి చెందింది. ప్రాణాలతో ఉన్న కృష్ణమూర్తి ని ఆసుపత్రికి తరలించారు.