పంట నష్ట పరిహారం ఇవ్వాలి

పంట నష్ట పరిహారం ఇవ్వాలి

మేడ్చల్, ముద్ర ప్రతినిధి: అకాల వడగండ్ల వర్షంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గడీల భైరవరెడ్డి కోరారు. రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకుభారీ నష్టం జరిగిందని, రైతుల అరుగాల కష్టం అడవి పాలు అయిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ,మెదక్ జిల్లాలలో వేల ఎకరాలలో వరి,మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, మిర్చీ, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాలను పరిశీలించి రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని   బైరవరెడ్డి  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.