ఎన్నికల్లో ఆత్రం సుగుణ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం - డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు

ఎన్నికల్లో ఆత్రం సుగుణ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం - డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆదిలాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. మామడ మండలంలోని మామడ ,న్యూసాంగ్వి ,పోన్కల్ ,నల్దుర్తి ,దిమ్మదుర్తి ,లింగాపూర్, గాయిధ్ పల్లి గ్రామాలలో  ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ పక్షాన ప్రచారాన్ని సోమవారం కొనసాగించారు.సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని, రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయాలని కోరారు. సీఎం  రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేంద్రంలో అధికారంలోకి రావడానికి పని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉపాధి హామి పథకం చట్టం తీసుకొచ్చి 100 రోజులు పని కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ . పది సంవత్సరాలు పరిపాలించిన బి ఆర్ ఎస్, బిజెపిలు ఉపాధి హామీ కూలీలను  పట్టించు కోలేదన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అన్నారు. ఉపాధి హామి కూలీలకు రోజు వారి కూలీ రూ.400  చెల్లిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మామడ జడ్పీటీసీ సోనియా సంతోష్, మండల అధ్యక్షులు అమృత జైసింగ్, పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ,మండల పరిషద్ ఉపాధ్యక్షులు ఏనుగు లింగారెడ్డి, మాజీ జెడ్పిటీసి సమీనా రఫీ, మాజీ బ్లాక్ అధ్యక్షులు రమణ రెడ్డి ,మాజీ సర్పంచ్ బాపయ్య , పడాల శ్రీనివాస్,నర్సారెడ్డి, మంగు లింగన్న, రత్నయ్య, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.