పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య చైర్మన్ జ్ఞానేశ్వర్ కు సన్మానం

పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య చైర్మన్ జ్ఞానేశ్వర్ కు సన్మానం

ముద్ర, రాజేంద్రనగర్, రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య చైర్మన్ గా నియమితులైన టిపిసిసి ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్ ముదిరాజును గండిపేట్ మండలానికి చెందిన పలువురు నాయకులు కలిసి సన్మానించారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పి కిషన్, మాజీ సర్పంచ్ గండయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ యాదవ్, కౌన్సిలర్లు అమరేందర్ రెడ్డి, దుర్గేష్ ల ఆధ్వర్యంలో జ్ఞానేశ్వర్ ని కలిసి శాలువాలు, పుష్పగుచ్చాలను  సన్మానించారు. నాయకులు  కిరణ్, బి. శ్రీనివాస్, అద్నాన్, జల్లి వెంకటేష్, రాము, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.