దళిత బంధు నిధులు విడుదల చేసి ఆదుకోవాలి

దళిత బంధు నిధులు విడుదల చేసి ఆదుకోవాలి
  • ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన లబ్ధిదారులు

తుంగతుర్తి ముద్ర:- గత ప్రభుత్వంలో మంజూరు అయిన దళిత బంధు నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విడుదల విడుదల చేసి పేద దళిత కుటుంబాలను ఆదుకోవాలని తుంగతుర్తి నియోజకవర్గ  దళిత బంధు లబ్ధిదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం దళిత బంధు లబ్ధిదారుల సాధన సమితి ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామెల్ ను అడ్డగూడూరు మండల కేంద్రంలో కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత కెసిఆర్ ప్రభుత్వం దళితులను దగా చేసిందని ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అని తెలియజేస్తూ దళితుల అభ్యున్నతికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మీ సమస్యను సంబంధిత మంత్రిత్వ శాఖ మంత్రి తొ పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రుల ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసిన వారిలో కొండగడుపుల ఎల్లయ్య, ఆకారపు సైదులు, మల్లెపాక రాములు, పోలేపాక సోమయ్య, వీరయ్య, పరశురాములు, మీసాల సోమయ్య, చంటి, పాల్వాయి వెంకన్న, మద్దెల వీరయ్య, పరమేష్, సాయికిరణ్, వెంకటేష్, బొంకురి సైదులు, నాగయ్య, నరసయ్య, వెంకన్న తో పాటు వివిధ మండలాల దళిత బంధు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.