కాంగ్రెస్ నాయకుని మృతి

కాంగ్రెస్ నాయకుని మృతి

మహదేవపూర్, ముద్ర: సూరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీటీసీ మేడి శ్రీనివాస్ (56)అనారోగ్యంతో శనివారం సాయంత్రం మృతి చెందారు. ఆయనకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. మేడి శ్రీనివాస్ తండ్రి మేడి శంకరయ్య మహాదేవపూర్ మండల ప్రధమ ఎంపీపీగా ఎన్నికై స్వర్గీయ శ్రీపాదరావుకు అత్యంత సన్నిహితులుగా పేరు గడించారు. మేడి శంకరయ్య మరణానంతరం కుమారుడు మేడి శ్రీనివాస్ ఆయన రాజకీయ వారసుడిగా కొనసాగుతున్నారు. శ్రీధర్ బాబుకు సన్నిహితంగా ఉండి రాజకీయంలో కొనసాగుతున్న మేడి శ్రీనివాస్ అనారోగ్య కారణంతో మృతి చెందారు. శుక్రవారం నాడు ఆయన భౌతిక కాయాన్ని శ్రీపాద ట్రస్టు చైర్మన్ దుద్దిల్ల శ్రీనివాస్ బాబు సందర్శించి నివాళులర్పించారు. మండలంలోని పరువు ప్రముఖులు ఆయన అంత్యక్రియలలో పాల్గొన్నారు.