పండుగ‌లా ద‌శాబ్ది ఉత్స‌వాలు

పండుగ‌లా ద‌శాబ్ది ఉత్స‌వాలు
  • పాలకుర్తిలో ప్రత్యేకంగా కార్యక్రమాలు
  • మంత్రి ఎర్రబెల్లి వెల్లడి

ముద్ర ప్రతినిధి, జనగామ : తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దశాబ్ది ఉత్స‌వాలు ప్రతి పల్లె పల్లెలో పండుగలా నిర్వహించాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులను అదేశించారు. జనగామ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల అధికారులతో మంత్రి పాలకుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేకంగా గురువారం సమీక్ష చేశారు.

రెండవ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించే రోజువారి కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు శాఖల వారీగా కార్యక్రమాల రూపకల్పన చేసి విజయవంతం చేసుకోవాలన్నారు. ఈ స‌మీక్ష‌లో జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, డి ఆర్ డి ఓ రాంరెడ్డి ఏపీ డి నూరుద్దీన్, వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు.