డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు

డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు
  • దేవాలయాల అభివృద్ధికి కృషి

ముద్ర ప్రతినిధి , కోదాడ:-హైదరాబాద్ నుండి మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం వెళుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం మార్గ మధ్యలో సూర్యాపేట జిల్లా , మునగాల మండలం , బరాఖత్ గూడెం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు వీరిరువురికి పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు . పూజల అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ తెలంగాణా వ్యాప్తంగా పురాతన దేవాలయాలకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చి అభివృద్ధి చేస్తుందని అన్నారు . కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మినారాయణ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వంగవీటి . రామారావు , కౌన్సిలర్లు సామినేని ప్రమీల , కర్రి శివ ,కందుల కోటేశ్వర రావు , రజనీకాంత్ , దావల్ తదితరులు పాల్గొన్నారు .